పల్లె ప్రగతిలో భాగంగా ఆలయం వరకు ప్రధాన రహదారి ఏర్పాటు
Published: Thursday June 16, 2022
కోరుట్ల, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో పల్లె ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా ముత్యాల ముంబై పోచమ్మ ఆలయం వద్దకు ప్రధాన రహదారిని ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా గ్రామంలోని మహిళలు మరియు యువత రైతులు గ్రామ సర్పంచ్ అంజయ్యను విన్నవించగా రోడ్డు సర్వే చేయించి ఆలయం వరకు ప్రధాన రహదారి ఏర్పాటు చేశారు. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి సౌకర్యంగా ఉండే విధంగా రహదారి నిర్మాణం చేసినట్లు గ్రామ సర్పంచ్ వనతాడుపుల అంజయ్య తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సి.హెచ్ నర్సయ్య, నిజాముద్దీన్, గణేష్, పెద్ద మల్లయ్య, శేఖర్, భానుచందర్, కృష్ణకాంత్, లక్ష్మీనారాయణ, శ్రీధర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: