కోరుట్ల లో ఘనంగా ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు

Published: Friday August 26, 2022

కోరుట్ల, ఆగస్టు 25 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన  సందర్భంగా స్థానిక కల్లూర్ రోడ్  లోని దుర్గామాత దేవాలయంలో పూజ, అర్చన కార్యక్రమం నిర్వహించి  ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలతో ఉండాలని  ప్రత్యేక  పూజలు నిర్వహించమని బీజేపీ నాయకులు తెలిపారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి వద్ద అన్నదానంనిర్వహించి, నిరుపేదలతో  కలిసి బీజేపీ నాయకులందరూ వారితో కలిసి భోజనం చేశారు. ఈ సేవా కార్యక్రమాలలో భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా యువమోర్ఛా, మహిళా మోర్చ, దళిత మోర్చా, మైనార్టీ మోర్చా అధ్యక్షులు,కార్యవర్గం,
మరియు బీజేపీ , బీజేయైఎం నాయకులు,కార్యకర్తలు అభిమానులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.