బతుకమ్మ కానుకలు అందించిన కొక్కిరాల సురేఖ.

Published: Friday October 01, 2021
మంచిర్యాల బ్యూరో, ప్రజాపాలన, 30, ప్రజాపాలన : కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ కానుకలు (చీరలను) డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజీపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని మహిళలకు గురువారం అందజేశారు. హాజిపూర్ మండల కేంద్రంతో పాటు వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్, నర్సింగపూర్, రాపల్లి, టీకానపల్లి, బుద్ధిపల్లి, దొనబండ, పెద్దంపేట్ గ్రామాల్లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న మహిళలకు  బతుకమ్మ కానుకగా చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పూట పేద మహిళలు ఆనందంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో సొంత ఖర్చులతో ప్రతీ సంవత్సరం చీరలను పంపిణీ చేయడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొట్టాల సుమలత శ్రీశైలం గౌడ్, ఎంపీటీసీ లు ఓడ్డే బాల్ రాజ్, డేగ బాపు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రావు, మండల అధ్యక్షులు తోట రవి, వడ్డే రాజమౌళి, రమేష్ చుక్కయ్య, రవీందర్, ముత్తె నగేష్, అశోక్ గౌడ్, నల్ల రవి, కుటుంబరావు, అంజి, కనకరాజు, రాంరెడ్డి, చిప్పకుర్తి లచ్చయ్య, రాజలింగు, మాల్యాల రాజేశం, బాలమల్లు, జగన్ రెడ్డి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.