అందరూ వ్యాధినిరోధకశక్తిని పెంపోదించుకోవాలి: ప్రభాకర్

Published: Tuesday March 02, 2021
మధిర మార్చి ఒకటి ప్రజాపాలన ప్రతినిధి: మధిర మెయిన్ రోడ్ లో కల శ్రీచైతన్య e techno స్కూల్ నందు కరోనా రాకుండా ఉండేందుకు విద్యార్థినీ విద్యార్థులకు హోమియో హాస్పిటల్ నిర్వాహకులు సంక్రాంతి శ్రీ నివాసరావు, బుగ్గవరపు హరీష్ లు హోమియో వాలంటీర్ మరియు ఉపాధ్యాయులు శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావు కుమారుడు, చిన్నారి మేడేపల్లి సాయిరోహన్ చేతుల మీదుగా అర్సినిక్ ఆల్బమ్ (AA) 30 ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి శ్రీ Y.ప్రభాకర్ గారు మాట్లాడుతూ కరోనానే కాదు ఇంకా ఎటువంటి కొత్త వ్యాధులు వచ్చినా వ్యాధినిరోధక శక్తి పెంపోదించుకుంటే సురక్షితంగా ఉండొచ్చు అని తెలిపారు. దానికోసం అర్సినిక్ ఆల్బమ్ 30 చక్కగా పనిచేస్తుంది కావున అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆకెళ్ళ భారతి, డీన్ యమ్ సాని నవీన్, వైస్ ప్రిన్సిపల్ గూడెల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.