కొప్పుల ఈశ్వర్ తో హోలీ వేడుకలు
Published: Tuesday March 30, 2021
ధర్మపురి నియోజకవర్గ మార్కెట్ కమిటీ అధ్యక్షులు.
వెల్గటూర్, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఏలేటి కృష్ణ రెడ్డి సోమవారం రోజు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో హోళి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ లు అయ్యోరి రాజేష్, ఏలేటి క్రిష్ణ రెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, అజ్మీర తిరుపతి నాయక్, ముస్కు లింగాల రెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ లు సునిల్,లక్ష్మణ్, సత్యనారాయణ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, పెగడపల్లి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాజేశ్వర్ రావు, మాజీ ఎం.పీ.పీ గంగుల అశోక్ పాల్గొన్నారు.
Share this on your social network: