కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Published: Friday June 03, 2022

మధిర జూన్ 2 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా  మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంసెట్టి కిషోర్* జాతీయ జెండా ఎగురవేశారు. అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ అందించిన కృషిని మనం గుర్తుచేసుకోవాలి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఆమె మాటను నిలబెట్టుకున్నారు  ప్రజల పోరాటం గెలవడానికి సహాయం చేశారు.  అలాగే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చరిత్రను మరచిపోవద్దని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది _అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు_ *సోనియాగాంధీ* అని గుర్తు చేశారు.. సోనియాగాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం వల్లే ఈ రోజు మనం సంబరాలు చేసుకుంటున్న మన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఈరోజు తెలంగాణ పేరు చెప్పి గద్దెనెక్కిన నాయకులు ఎక్కడ ఉండేవారని అన్నారు.ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మున్సిపాలిటీ కౌన్సిలర్ లు *కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు* మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* సర్పంచ్ *మదార్ సాహెబ్* మాజీ సర్పంచులు *కర్నాటి రామారావు బొమ్మకంటి హరిబాబు మువ్వా వెంకయ్య బాబు* మండల st సెల్ నాయకులు *బాలు నాయక్* మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్యా*  ఎస్సీ అధ్యక్షుడు *గద్దల లాలయ్యా* డివిజన్ కమిటీ అధ్యక్షులు *మాగం ప్రసాద్, బండారి నరసింహారావు, కోట డేవిడ్, ఆదిమూలం శ్రీనివాసరావు తలుపుల వెంకటేశ్వర్లు, మైలవరపు చక్రి, జమిల్ పాషా, సయ్యద్ అలీ, సంపశాల రామకృష్ణ* *అల్లాడి గోపాల్ రావు. పోచంపల్లి శంకర్రావు జనార్దన్ రావు  సామినేని కోటేశ్వరరావు*  తదితరులు పాల్గొన్నారు