ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *మజీద్ పూర్ లో మంచిరెడ్డి ప్రశాంత్ అన్న ప్రగత

Published: Saturday March 11, 2023
ప్రగతి నివేదన యాత్ర సందర్భంగా 48వ రోజు ఉదయం పాదయాత్రతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మజీద్ పూర్ గ్రామానికి చేరుకున్న యువనేత  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి , గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి, కావలసిన అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు.
గ్రామ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ రెడ్డి  ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ...
మజీద్ పూర్ గంగమ్మపెద్దమ్మ గుడి వరకు రోడ్డు కొరకు 5లక్షల రూపాయలు, ఎస్.సీ కమ్యూనిటి హాల్ కు 2లక్షల రూపాయలు ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  సహకారంతో మంజూరు చేశారు.
ప్రధాన సమస్య అయిన సీలింగ్ భూ సమస్య గురించి ఎమ్మెల్యే తో చర్చించి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హాని ఇచ్చారు.
గుంతపల్లి నుండి మజీద్ పూర్ దారిలో బ్రీడ్జ్ ను ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  మంజూరు చేశారని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు.