మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు డిపో మేనేజర్ దేవదానం

Published: Tuesday February 14, 2023

మధిర రూరల్ ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో ఈనెలఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి అటు వైరా మండలం  స్నానాల లక్ష్మీపురం జాతరకు ఇటు మధిర నుండి కూడేల్లి తిరునాళ్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి డిపో మేనేజర్ దేవదానం సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపనున్నట్లు తెలియజేశారు