రమణరెడ్డికి మాజీ ఎంపీ పొంగులేటి నివాళులు..
Published: Thursday February 03, 2022
తల్లాడ, ఫిబ్రవరి 2 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ సహకార సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి దగ్గుల రమణారెడ్డి (60) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుమారుడు రాజశేఖర్ రెడ్డిని పరామర్శించి మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సంతాపం భూతిని వ్యక్తం చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లవరం ఉప సర్పంచ్ ఎర్రి నరసింహారావు, ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి, తల్లాడ విడిసి చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, గోపాల్ రెడ్డి, అప్పిరెడ్డి, ఏమిశెట్టి నాగన్న, భద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
Share this on your social network: