ఉప్పల్ లో ఓక్యూలస్ ఐ క్లినిక్ ప్రారంభం

Published: Tuesday March 02, 2021
మేడిపల్లి, ఫిబ్రవరి 1 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ప్రజలకు మెరుగైన కంటి పరీక్షలు, నాణ్యమైన కంటి అద్దాలు అందించాలనే ఉద్దేశంతో ఉప్పల్ ప్రధాన రహదారి మేకల కాంప్లెక్స్ లో ఓక్యూలస్ ఐ క్లినిక్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు సిద్దు పేర్కొన్నారు. ఈ ఐ క్లినిక్ ప్రారంబోత్సవానికి ముఖ్య అతిథులుగా అభినవ్ ఐ హాస్పిటల్ ఎం. డి.డాక్టర్. వేణుగోపాల్ రావు, ఉప్పల్ ఎస్ ఐ జయరాంలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వివిధ కంటి పరీక్షలు, కళ్లజోళ్లు ఉంచినందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు సిద్దు మాట్లాడుతూ కళ్లజోళ్లు నాలుగు వందల రూపాయల నుండి యాభై వేల వరకు ఉన్నాయని, కంటి పరీక్షలు నిపుణులైన వైద్యులతో నిర్వించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.