మృతుని కుటుంబాన్ని పరమార్శించిన డి.ఎస్.పి వెంకట రమణ
Published: Saturday June 19, 2021
కొడిమ్యాల, జూన్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన సింగిల్విండో చైర్మన్ మేనేని రాజనర్సింగ రావు చిన్న సోదరుడు సత్యనారాయణ రావు ఇటీవల స్వర్గస్తులైనందున వీరి కుటుంబాన్ని శుక్రవారం జగిత్యాల డి.ఎస్.పి వెంకటరమణ, మల్యాల సిఐ కిషోర్, కొడిమ్యాల ఎస్సై మహేందర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ ఎంపిటిసి బసనవేని మహేష్, టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేరెళ్ల మహేష్ మాజీ ఎంపిటిసి సమీర్ శెట్టి సురేష్ గ్రామ శాఖ అధ్యక్షులు చిర్ర సుధాకర్ కోలకాని సత్యం, మొర్రి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: