జీవీఆర్ ను పరామర్శించిన అధికారులు..

Published: Tuesday September 20, 2022
 తల్లాడ, సెప్టెంబర్ 19 (ప్రజా పాలన న్యూస్):
 
 తల్లాడకు చెందిన టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు (జివిఆర్) మాతృమూర్తి లక్ష్మి మృతి చెందిన విషయం విజేతమే. ఈ విషయం తెలుసుకున్న మండలాధికారులు సోమవారం లక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో రవీంద్రారెడ్డి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవ్యకాంత్, ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు.  జీవీఆర్ ను పరామర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.