రైతులకు కంది విత్తనాలు ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది

Published: Friday June 24, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో జూన్ 23 
ఈరోజు (23-06-2022) గురువారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు *"మీతో నేను"* కార్యక్రమంలో భాగంగా *వికారాబాద్* మండల పరిధిలోని *పీలారం* గ్రామంలో *06:30 AM* నుండి *10:30 AM* వరకు పర్యటించారు.
 
◆ గ్రామంలో నీరు రోడ్లపై పారడంతో మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.
 
◆ ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలన్నారు.
 
◆ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రమాదవశాత్తు మరణిస్తే  *రైతు భీమా* కల్పిస్తుందని, రైతు భీమాకు దరఖాస్తు చేసుకోలేని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే మరియు కొత్త పాస్ పుస్తకాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
 
◆  గ్రామంలో అవసరమైన వీధులలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న @విద్యుత్ తీగలను సరిచేయాలని, లో ఓల్టేజ్ సమస్య ఉండటంతో 25KV నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
 
◆  మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని, లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ... సురక్షిత మంచి నీటి సరఫరా చేయాలని ఆదేశించారు, ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ మంచి నీటిని త్రాగాలని సూచించారు.
 
◆ ప్రతి గ్రామంలో రైతులకు కంది విత్తనాల మిని కిట్స్ పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ వారిని ఆదేశించారు. రైతులకు కంది విత్తనాలు ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తుందన్నారు.
 
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
Reply
Forward