మతిస్థిమితం లేని వ్యక్తిని బంధువులకు అప్పగించిన ఆర్కే

Published: Monday March 13, 2023

ఫౌండేషన్ మధిర మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మతిస్థిమితం లేని వ్యక్తికి బంధువులు అప్పగించిన ఆర్కే పౌండేషన్ చౌడవరం గ్రామం కొండపి మండలం ప్రకాశం జిల్లా వాసి శివకుమార్ మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుండి నాలుగు రోజుల క్రితం బయటకు వచ్చి మధిర రైల్వే స్టేషన్ కు చేరుకొని అక్కడి నుండి కాజీపురం వరకు నడుచుకుంటూ వచ్చి బస్టాండు లో కూర్చుని ఉండగా గ్రామస్తులు విచారించి ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే ను సంప్రదించగా అతని వద్దకు వెళ్లి పరిస్థితి గమనించి పోలీసు వారికి మరియు సోషల్ మీడియాకు తెలియజేసి ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి తరలించడం జరిగింది. ఈ వార్తను  పేపర్ లో ప్రకాశం జిల్లాలో  ప్రచురించగా కుటుంబీకులు గుర్తించి రైల్వే జి ఆర్ పి పోలీస్ వేణుగోపాల్ రెడ్డి సహకారంతో ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి వచ్చి గుర్తింపు కార్డు ఆధారంగా విచారణ చేసి అతనిని బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబీకులు ఆర్కే ఫౌండేషన్  వారికి కన్నీటితో తమ కృతజ్ఞతలు తెలియజేశారు.