దళిత బంధు ప్రతి గ్రామానికి ఇవ్వాల

Published: Wednesday September 22, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ర్రుపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత బంధు ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక గ్రామానికి ఇవ్వాలని ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల డిప్యూటీ తాసిల్దార్ కి దళిత బందు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి అమలు చేయాలని అని ఒక అప్లికేషన్ ని తయారు చేసి దానిలో ప్రతి వ్యక్తి సంతకం, ఫోన్ నెంబర్, గ్రామం పేరు రాసి ఉంచి ఆ పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ కు ఇవ్వడం జరిగింది. ఒక huఈ కార్యక్రమంలో మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దేవరకొండ శీను, మదిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, కిసాన్ సెల్ అధ్యక్షులు శీలం నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శీలం శ్రీనివాస్ రెడ్డి, ఐఎన్టియుసి అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు కడియం శ్రీనివాసరావు, మైనారిటీ అధ్యక్షులు షేక్ జాన్ బాషా, లింగాల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, అభిమానులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు