ఎన్.ఎస్.ఆర్ నగర్ సిపిఎం కార్యదర్శిగా కొండిగారి శంకర్ ఎన్నిక
Published: Wednesday October 06, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : అబ్దుల్లాపూర్ మండల యాంజల్ మున్సిపాలిటీలోని ఎన్.ఎస్.ఆర్ (నీలం సంజీవ రెడ్డి) నగర్ సిపిఎం పార్టీ శాఖా కార్యదర్శిగా కాలనీకి చెందిన కొండిగారి శంకర్ ను ఈ రోజు జరిగిన పార్టీ మహాసభలో సభ్యుల మెజారిటీ తీర్మానంతో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఎన్.ఎస్.ఆర్ నగర్ నూతన శాఖ కార్యదర్శిగా ఎన్నికైన కొండిగారి శంకర్ మాట్లాడుతూ పార్టీ నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజా సంఘాలు నిర్మించి రాబోయే రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు బోదాసు. వెంకటేష్, పులమోని రామచంద్రయ్య, గంపెల్లి. ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు పార్టీ మహాసభ పరిశీలకులుగా సిపిఎం మున్సిపల్ భాద్యులు డి.కిషన్, మండల కమిటీ సభ్యులు కె.అరుణ్ కుమార్, టి.నర్సింహా హాజరై భవిష్యత్ కర్తవ్యాలను నిర్ధేశించారు.
Share this on your social network: