మల్లారం నెమలి రూట్ లో బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలివిద్యార్థులకు సమయం అనుకూలంగా బస్ సర్వీసులు

Published: Wednesday September 22, 2021
 మధిర, సెప్టెంబర్ , ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధి రోజు మల్లారం నెమలి రూట్ లో బస్సు సర్వీసులు నడపాలని అఖిల భారత విద్యార్థి సమైక్య AISF మధిర నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మధిర డిపో మేనేజర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్మాట్లాడుతూ మల్లారం నెమలి రూట్ లో బస్సు లేకపోవటం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గతంలో బస్ సర్వీస్ ఉండేదని కానీ ఇప్పుడు లేకపోవడం వల్ల విద్యార్థులు సకాలంలో కళాశాలకు చేరుకోలేక పోతున్నారు అని బస్సు లేకపోవటం వల్ల ఆటోలు ద్వారా అధిక ఛార్జీలు చెల్లించి కళాశాలకు వెళ్తున్నారని తక్షణమే ఈ రూట్లో బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా మధిర నుంచి వంగవీడు కూడా బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని కల్లూరు రూట్ లో బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపవరం, మధిర నందిగామ రూట్ లో అదనంగా బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో AISF మధిర డివిజన్ కార్యదర్శి ఉగం సురేష్ మండల నాయకులు సాయి అజయ్ సురేష్ కళ్యాణి సరిత స్వాతి తేజ తదితరులు పాల్గొన్నారు.