తెలంగాణ వార్డు మెంబర్స్ మహిళా ఇంచార్జీ నియామకం
Published: Monday June 21, 2021
కొడిమ్యాల, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ వార్డు మెంబెర్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్న కుమారస్వామి, జగిత్యాల జిల్లా మహిళ విభాగం ఇంచార్జిగా కొలకాని పుష్పాలతను శనివారం నియమించారు. పుష్పలత మాట్లాడుతూ జిల్లాలోని మహిళ వార్డు మెంబెర్ల హక్కులు, సమస్యల పరిష్కరనికి కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొడిమ్యాల మండలానికి మహిళా ఇంచార్జీ ఇవ్వడంతో మండల స్థాయిలో ప్రజలు కొలకాని పుష్పలతకు అభినందనలు తెలిపి మండల స్థాయిలో సంబురాలు జరుపుకున్నారు.
Share this on your social network: