జన్నారం, డిసెంబర్ 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో అక్రమంగా
అశ్వాపురం (ప్రజా పాలన.)
అశ్వాపురం: రేపు అనగా డిసెంబర్ 31 సందర్భంగా మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తో,ప్రశాంత వాతావరణం లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని
31 రాత్రి ఎవరైనా చట్ట విరుద్ధమైన పనులు చేసిన, కొట్టుకున్న,రోడ్లమీద ఇబ్బందికరంగా ప్రవర్తించిన,
టు వీలర్ బైక్ పై స్టంట్స్ చేసిన ,ర్యాష్ డ్రైవింగ్ చేసిన,, మైనర్ లు వాహనాలు నడుపిన.ఇతరులకు ఇబ్బందులు కలిగించిన రోడ్డు పై కేక్ కటింగ్, ఓపెన్ డ్రింకింగ్ చేసిన
పై నిబంధనలు ఉల్లంఘించిన ఎడల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వాపురం సిఐ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని యువత అంతా కూడా సమయమును పాటించాలని జాగ్రత్తగా అందరూ ఇంటి వద్దనే ఉండి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలని వారి యొక్క కలలు నెరవేర్చాలని న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని వారు ఈ సందర్భంగా తెలిపారు.
Share this on your social network: