ఫోటోగ్రఫీ మండల అధ్యక్షుడిగా పరమేష్.

Published: Wednesday June 29, 2022
ఏన్కూరు మండల ఫోటోగ్రఫీ మండల అధ్యక్షుడి ఎన్నిక మంగళవారం జరిగింది. మండల అధ్యక్షుడు కొవ్వూరి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫోటోగ్రఫీ నూతన మండల అధ్యక్షుడిగా టి ఎల్ పేట గ్రామానికి చెందిన బీరెల్లి పరమేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా సింగం నేటి నరేష్, ట్రెజరర్ గా భూక్య జగన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామారావు, కిషోర్, సైదా,సురేష్, వెంకీ,నవీన్ చారి, అఖిల్, అనిల్, అశోక్, హరీష్, రవి తదితరులు పాల్గొన్నారు.