తాడికల్ లో కంటి వెలుగు శిబిరం ప్రారంభం శంకరపట్నం ఫిబ్రవరి 16 ప్రజాపాలన రిపోర్టర్

Published: Friday February 17, 2023

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో రైతు వేదిక నందు ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని గురువారం గ్రామ సర్పంచ్ కీసర సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బసిరుద్దీన్, ఎంపీటీసీ బుద్ధార్తి వరలక్ష్మి, క్యాంపు వైద్యాధికారి డాక్టర్ సుమన్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.