మురుగన్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్

Published: Monday March 29, 2021
మేడిపల్లి, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి): ఉప్పల్ బస్ డిపో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మురుగన్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో మురుగన్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ను ప్రారంభించామని ఆసుపత్రి నిర్వాహకుులు బాలచందర్ తెలియజేశారు. ఈ హాస్పిటల్ లో అన్నిరకాల జబ్బులకు వైద్యం అందించటానికి మంచి అనుభవం కలిగిన వైద్యులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారని ఎమర్జెన్సీ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పీర్జాదిగూడ నగర టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.