ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

Published: Monday January 31, 2022
భారత కార్మిక కేంద్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి జాడి దేవరాజ్
మంచిర్యాల టౌన్, జనవరి 30, ప్రజాపాలన: భారత కార్మిక కేంద్ర  సంఘం  అనుబంధ సంఘo అయినా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని ఆదివారం రోజున ఎన్నుకున్నారని సంఘం అధ్యక్షులుగా చదువుల దేవయ్య ఉపాధ్యక్షుడిగా నామాల సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా ఆకుల భూమయ్య సహాయ కార్యదర్శిగా తోట విజయ్ కోశాధికారిగా విలాసాగర్ తిరుపతి కమిటీ సభ్యులుగా గాండ్ల శంకర్ బిల్లా లచ్చన్న ఆకుల భీమన్న శంకర్ సారంపల్లి అంకుల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందాని ఈ సంద్భంగా దేవరాజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది నిర్మాణ రంగ కార్మిక వర్గం ఇన్సూరెన్స్ కార్డులు తప్పక తీసుకోవాలని సంఘంలో సభ్యత్వం అందరూ తీసుకోవాలని కార్మికులను ఉద్దేశించి చెప్పడం జరిగినదని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గోగర్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల సదానందం ఏ ఐ కె ఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.