ప్రభుత్వం అన్న మాటను నిలబెట్టుకుంది ** ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ **

Published: Monday September 05, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 04 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ గుర్తు చేశారు. ఆదివారం మండలంలోని ఈదుల వాడ, చిలేటి గుడా, గ్రామ పంచాయతీలలో పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ పింఛన్ అనేది ఆసరా లేని వారికి కొండంత అండగా ఉంటుందని దాన్ని గుర్తించిన ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంన్నాం అన్నారు. ఈ నిర్ణయం పై ప్రకటన చేయడంతో పాటు

అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ లు బూసి భీమేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.