2వ డివిజన్లో ఘనంగా బోనాల ఉత్సవాలు

Published: Monday July 25, 2022
మేడిపల్లి, జూలై24 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో డివిజన్లో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డివిజన్లోని కాకతీయ నగర్, పంచవటి కాలనీలో నెలకొన్న అమ్మవారి ఆలయాలను కార్పొరేటర్ సుభాష్ నాయక్ తో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ దొంతిరి  హరిశంకర్ రెడ్డి, తెరాస నాయకులు        బైటింటి ఈశ్వర్ రెడ్డి సందర్శించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షులు పి. బాలరాజ్, కార్యదర్శి, వి. శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్, సురేందర్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి, శంకర చారీ, రాజన్న నాయక్, విమల బాయి, కాలనీ వాసులు పాల్గొన్నారు.