ఖేడ్ లో రహదారి భద్రత ఆడిటర్ రమేశ్ కుమార్ దావులూరి పర్యటన
Published: Saturday December 11, 2021
హైదరాబాద్ 10 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పి.యం.జి.ఎస్.వై) పథకం కింద తయారు చేసిన రోడ్ల ప్రతిపాదనలను పరిశీలించ నున్న రహదారి భద్రత నియంత్రణ ఆడిటర్ రమేశ్ కుమార్ దావులూరి. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల మనూరు మండలం లోని గట్టు లింగం పల్లి నుండి బోరంచ వయా రుద్రారం, దూదిగొండ 6 కి.మీ. రోడ్డు మరియు కంగ్టీ మండలం లోని కంగ్టీ నుండి కర్నాటక బార్డర్ వయా బీంమ్రా, నాగూర్(కె) 7 కి.మీ. పి.ఎం.జి.ఎస్.వై. నిధుల కింద ప్రతిపాదించిన రోడ్లను రహదారి భద్రత నియంత్రణ ఆడిటర్ రమేశ్ కుమార్ దావులూరి శనివారం నాడు పరిశీలించడం జరిగుతుందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Share this on your social network: