న్యాయ విజ్ఞాన సదస్సు తిరుమలాపూర్
Published: Thursday October 07, 2021
కొడిమ్యాల, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల తిరుమలాపూర్ న్యాయవిజ్ఞాన సదస్సు లో సర్పంచ్ పద్మ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో న్యాయవాదులు ప్రజలకు న్యాయవ్యస్థ గురుంచి మోటార్ వాహనాల గూర్చి ప్రమాదాల గూర్చి భూమి వివాదాల గూర్చి గ్రామంలో అల్లర్లు గొడవలు చేసుకోకుండా ప్రజలు శాంతిగా పండగలు జరుపుకోవాలని సూచనలు ఇచ్చారు. సర్పంచ్ పద్మ మాట్లాడుతూ న్యావాదులు మాగ్రామ ప్రజలకు మంచి అవగాహనా కలిపించారని ప్రజలు ఇకనుండి న్యావాదులు చేపినవిదంగా యువత మంచి మార్గంలో నడుచుకోవాలని గ్రామప్రజలను కోరారు. ఇట్టి కార్యక్రమంలో న్యావాదులు బండ బాస్కర్ రెడ్డి, డబ్బు లక్ష్మ్ రెడ్డి, భూమి రమణ, గుడికందుల మహేష్, శ్రీనివాస్, నాయకులూ మాజీ ఎం పి టి సి మల్లేష్ యాదవ, మాజీ సర్పంచ్ హరేందర్, కోలకని సత్యం, పెంకాసుల మల్లయ్య, సురేష్ రావు, మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: