రైతు సోదరులు రైతు భీమాకు దరఖాస్తులు చేసుకోవాలని సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి కోరారు

Published: Wednesday August 11, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 09 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చెందిన సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాలతో పాటు రైతు భీమా పథకం కింద రైతులకు బాసటగా నిలుస్తుందని, ప్రతి ఒక్క రైతు వ్యవసాయ కార్యాలయానికి (అగ్రికల్చర్ ఆఫీస్) వెళ్లి, కొత్త పాస్ బుక్కులు ఎవరికైతే  ఉన్నాయో వారు దరఖాస్తులు తో పాటు ఆధార్ కార్డ్, పాస్ బుక్ జిరాక్స్ లను జతపరచిలని తెలిపారు. వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలని   సర్పంచ్ బూడిద రాంరెడ్డి తెలిపారు.