అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్
Published: Friday May 21, 2021
బాలపూర్, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ మేయర్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్మాస్ గూడ 3వ డివిజన్ రామిడి మల్లారెడ్డి నగర్ లో అల్మాసగుడా కమాన్ నుండి ఫార్మా కంపెనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. అనంతరం ఆమె మాట్లాడుతూ.... ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కి ఎంతో క్రమశిక్షణతో సహకరిస్తున్న ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే ఈ నెల 30 వరకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, స్థానిక కార్పొరేటర్ రామిడి మాధురి వీరకర్ణ రెడ్డి, ఏఈఈ బిక్కు నాయక్, టిఆర్ఎస్ నాయకులు సంరెడ్డి వెంకట్ రెడ్డి, రామిడి సుర్ణ కర్ణ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: