వైఎస్ఆర్ టిపి జెండా ఎగురవేస్తాం

Published: Wednesday September 21, 2022
వైఎస్ఆర్ టిపి జిల్లా పరిశీలకులు బండారు అంజన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజా పాలన : రాబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్టిపి జెండా ఎగురవేస్తామని వైఎస్సార్ టిపి జిల్లా పరిశీలకులు బండారు అంజన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో వై ఎస్ ఆర్ టి పి జిల్లా అధ్యక్షుడు మామిడి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ నియంత పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని తెలిపారు ఒంటెత్తు పోకడలతో ఏ మంత్రిని ఎమ్మెల్యేలను దరిదాపుల్లోకి రానివ్వడం లేదని విమర్శించారు తానే ఏకచిత్రాధిపత్యం వహిస్తూ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఘాటుగా స్పందించారు వైఎస్సార్ టిడిపి వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల సమావేశాలకు జనం తండోప తండాలుగా తరలి వస్తున్నారని గుర్తు చేశారు వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతుందని తెలిపారు ఈ సమావేశంలో వై.ఎస్.ఆర్.టి.పి పాదయాత్ర పరిశీలకులు శాంతి కుమార్ వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వసంత్ కుమార్ ధరూర్ మండల ఇన్చార్జ్ రత్నం ప్రసాద్ కుమార్ బందయ్యా గోవర్ధన్ రెడ్డి రమేష్ వెంకటేష్ తదితర వై.ఎస్.ఆర్.టి.పి కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area