ఎస్సీ శ్మశానవాటికలో పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

Published: Wednesday May 18, 2022
కార్పొరేటర్ సుభాష్ నాయక్
మేడిపల్లి, మే 17 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్

 2వ డివిజన్లోని ఎస్సీ శ్మశానవాటికలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్ అధికారులకు సూచించారు. ఈమేరకు కార్పొరేటర్ మున్సిపల్ అధికారులతో కలిసి శ్మశానవాటికను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ శ్రీనివాస్, ఏఈ వినీల్ కుమార్ 

తదితరులు పాల్గొన్నారు.