ఆర్థిక సాయం అందజేసిన తూప్రాన్ పేట్ మాజీ సర్పంచ్ అల్మాస్ పెట కిష్టయ్య

Published: Thursday November 24, 2022
 చౌటుప్పల్ నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన పిట్టల తరుణ్ వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయి ఆసుపత్రి ఖర్చులకై దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న విషయం పత్రిక ప్రకటనల ద్వారా తెలుసుకున్న చౌటుప్పల్ టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి,తూప్రాన్ పెట మాజీ సర్పంచ్ అల్మాస్ పెట్ కిష్టయ్య 6000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. మానవత్వం ఉన్న దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తూర్పుంటి యాదయ్య, పులిగిల్ల ఇస్తారి, పిట్టల గిరి, బందెల మల్లేష్, ఆరుట్ల లింగస్వామి, ఊదరి నరేష్, ఉదరి స్వామినాథ్, తదితరులు పాల్గొన్నారు.