ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కున్న తొందర నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వటంలో ఎందుకు లేదు

Published: Wednesday November 24, 2021
పాలేరు నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశానికి మండల అధ్యక్షులు మన్నే కృష్ణ రావు అధ్యక్షతవహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర నాయకులు కడమంచి రమేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కేలపల్లి, నరేందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా. రవి కుమార్, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యుడు షరీఫుద్దీన్, మండల సీనియర్ నాయకులు కోటి హనుమంతరావు కాలింగ్ టు వెంకటేశ్వర్లు సూరేపల్లి జ్ఞాన రత్నం మండల ప్రధాన కార్యదర్శులు గంధం వంశీ భాగం రవి మండల పద అధికారులు మండల మోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో లో టి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని రాష్ట్ర ప్రజలంతా కుటుంబ పాలన నియంతృత్వ పాలన పోవాలంటే భారతీయ జనతా పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో ఫాంహౌస్లో పడుకున్నా కెసిఆర్ను ధర్నా చౌక్ తీసుకొచ్చారని ఈటెల రాజేందర్ గెలుపుతో మతిభ్రమించి లేనిపోని అవాక్కులతో భారతీయ జనతా పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ పై అవాక్కులు చవాకులు మాట్లాడుతున్నారని కొడుకు కి పట్టాభిషేకం చేయడం కుదర లేదని మతిభ్రమించి మాట్లాడుతున్నాడు నే రాష్ట్ర నిరుద్యోగులు రైతాంగం పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెంటనే ఇచ్చిన ముఖ్యమంత్రి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదని తెలంగాణ అమరవీరుల శవాలపై రాజకీయం చేసిన కెసిఆర్ అధికారం రాగానే ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల మర్చిపోయి తెలంగాణ వ్యతిరేకులకు మంత్రి పదవులు ఇచ్చి అమరవీరుల ఆశయాలను ఆత్మను వంచన చేశాడని జిల్లా అధ్యక్షుడు గల్లా. సత్యనారాయణ అన్నారు