దర్మపురి అరవింద్ పై దాడి ని కండిస్తూ బిజెపి నిరసన.

Published: Friday January 28, 2022
దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్.
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 27, ప్రజాపాలన : నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి పై, బిజెపి కార్యకర్తల పై టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడాన్ని ఖండిస్తూ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద ప్లే కార్డులు ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. బిజెపి మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ లో బిజెపి బలపడటాన్ని జీర్ణించుకోలేక టిఆర్ ఎస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహించడం బాధాకరం అని అన్నారు. ఇంకొకసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్నా రాజా సిసోడియా, కర్ణ శ్రీధర్, బొయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, రేకాందర్ వాణి, బొద్దున మల్లేష్ ఆకుల అశోక్ వర్ధన్, బుద్దరపు రాజమౌళి, ముదాం మల్లేష్, పూదరి రమేష్, సోమ ప్రదీప్ చంద్ర, రాచకొండ సత్యనారాయణ, బోయిని దేవేందర్, కుదురుపాక గంగన్న, నాగుల రాజన్న, గట్టు దయాకర్, దేవి సాయి, తరుణ, బిందు భవాని మరియు తదితరులు పాల్గొన్నారు.