బ్యాంకులో అధికారులకు కరోనా నిబంధనలు పట్టవా?
Published: Friday April 30, 2021
పరిగి, 29 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, రోజు రోజుకు కరోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్న అవసరమున్న చోట ఆ నిబంధనలను పాటించడం లేదు.జీఓ నెం 68 ప్రకారం సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ మస్కులు ధరించాలని అందుకోసమై ప్రత్యేక చర్యలు చేపడుతున్నా ప్రజల్లో అవగాహన లోపం కారణంగా కరోనా వ్యాప్తికి కారణమౌతున్నారు. దోమ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో ఖాతాదారులు ఈ నిబంధనలను పాటించడం లేదు. బ్యాంకులో లావాదేవీల నిమిత్తమై ఖాతాదారులు సామాజిక దూరాన్ని పాటించడం లేదు. అయితే వీటి పై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడమే కారణం అని పలువురు విమర్శిస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకులో కరోనా నిబంధనలు పాటించెలా చూడాలనీ కోరుతున్నారు.
Share this on your social network: