పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్

Published: Wednesday June 29, 2022

జగిత్యాల, జూన్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల అర్బన్ మండల తిప్పన్న పెట్, మోతే గ్రామాల్లో  పల్లే ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్డు లను ప్రారంభించి, కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి, రూరల్ మండల వెల్దుర్తి గ్రామంలో వైకుంఠ ధామం, క్రీడా ప్రాంగణం ప్రారంభించి, వానాకాలం పంట పెట్టుబడి రైతు బందు విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి  కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకంచేసి, వెల్దుర్తి, గొల్లపల్లే లో సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను  ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు ములాసపు లక్ష్మి, పాలేపు రాజేంద్ర ప్రసాద్, జెడ్పీటీసీ మహేష్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సర్పంచులు జయ రాజలింగం, స్వప్న రాజేశ్వర్ రెడ్డి, బుర్ర ప్రవీణ్, ప్రకాష్, చెరుకు జాన్, ఎంపిటిసి లు రాజశేఖర్ రెడ్డి, అర్బన్ మండల రైతు బందు కన్వీనర్ జుంబర్ట్ శంకర్, ఉప సర్పంచి లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.