నష్టపరిహారం చెల్లించే వరకు రైతుల ధర్నా కొనసాగుతుంది
Published: Saturday November 26, 2022
చౌటుప్పల్ నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): మల్కాపురం తూప్రాన్ పేట్ గ్రామాలకు చెందిన రైతులు నేషనల్ హైవే పనులు నిలిపివేసి ధర్నా చేశారు రైతులు తమకు నష్టపరిహారం చెల్లించే వరకు పనులు సాగనివ్వమని భీష్మించి కూర్చున్నారు నష్టపరిహారం చెల్లించకుండా తమ భూముల్ల వదులుకున్న ప్రసక్తి లేదన్నారు ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది సర్వే నెంబర్ 75 మల్కాపురం రైతు ఏనుగు పుల్లారెడ్డి, ఏనుగు గోపాల్ రెడ్డి, సర్వేనెంబర్ 74 కొడాలి బసవరాజు, గంగా భవాని, సుగుణమ్మ, బలమని, తూప్రాన్ పెట్ రైతులు సర్వే నెంబర్లు 21 22 23 గల భూమి రాజు, నగేష్, శ్రీను, వెంకటేష్, శ్రీశైలం, ప్రవీణ్, వద్ది చంద్రయ్య, పెంటయ్య, లక్ష్మమ్మ, గోవర్ధన్, వెంకటేష్, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: