వికసించిన మే పుష్పం

Published: Friday May 21, 2021

బెల్లంపల్లి, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి సంవత్సరం మండుటెండ మే నెలలో మాత్రమే పుష్పించే మే పుష్పం బెల్లంపల్లిలో వికసించింది. బెల్లంపల్లి పట్టణం లోని ఒకటవ వార్డు మధునన్న నగర్లోని శంభోజి  శ్రీనివాస్ ఇంట్లో పుష్పించిన మే పుష్పం ఎర్రగా తెల్లగా రంగు రంగులుగా పుష్పించి చూపరులను ఆకట్టుకుంటుంది, ఈ సందర్భంగా ఇంటి యజమాని శంభోజి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెలలో క్రమం తప్పకుండా పుష్పించే ఈ పుష్పం గత మూడు రోజులుగా నెమ్మది నెమ్మదిగా గురువారం నాటికి పూర్తిగా విక సించిందని ఈ పుష్పం చూడడానికి చాలామంది బస్తీవాసులు మహిళలు పిల్లలు ఎక్కువగా వచ్చి చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.