ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్రెజర్ ఉచితంగా అందజేసిన సుధీర్

Published: Thursday December 01, 2022
జన్నారం, నవంబర్ 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామంలోని ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలకు పదివేల రూపాయల విలువ గల వాటర్ ఫ్రీజర్ ఉచితంగా కంప సుధీర్ అందజేయడం జరిగిందని బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాజళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి విజయ్ కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొండు జనార్దన్, పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, మాట్లాడుతూ మండల కేంద్రంలోని పొనకల్ ప్రభుత్వ పాఠశాలకు రూ,10, 000 విలువ గల వాటర్ ఫ్రీజర్ విరాళం ఇచ్చినందుకు కంప సుధీర్ ను వారు అభినందించారు. ఈ కార్యాక్రమంలో ఉపాధ్యాయులు, ప్రభాకర్, విమల, సి ఆర్ పి దయాకర్, మధ్యాహ్న భోజన వంట సభ్యురాలు ఐలవేణి లక్ష్మి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.