అంబెడ్కర్ సంఘ మండల అధ్యక్షులుగా తిరుపతి.

Published: Thursday February 03, 2022

కొడిమ్యాల, ఫిబ్రవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తెలంగాణ అంబేడ్కర్ సంఘం  మండల అధ్యక్షులుగా నల్లగొండ గ్రామానికి చెందిన కన్నం తిరుపతిని నియమిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి అమర్నాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భముగా కన్నం తిరుపతి మాట్లాడుతూ నాపై ఉంచిన బాధ్యతాయుతమైన ఈ కార్యక్రమమును నేను నా స్వలాభం కోసం కాకుండా, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డా||బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాళ్లను చైతన్య పరుస్తూ, రాష్ట్ర ఆదేశానుసారం మలుచుకుని, నా విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తిస్తానని మరొక్కసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ అంబేడ్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఇరుగురాల ఆనందం మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి అమర్నాథ్, జిల్లా అధ్యక్షులు లంక రవిందర్, రామడుగు మండలం అధ్యక్షులు చంటి శ్రీనివాస్, లకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.