కోరుట్లలో అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ మంద మకరందం

Published: Friday January 06, 2023

కోరుట్ల, జనవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలో  పలు అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ మంద మకరంద పర్యవేక్షించారు. నూతనంగా ఏర్పాటు చేయబోవు బస్తి దవాఖాన, ప్రభుత్వ హాస్పిటల్ లో  డయాలసిస్ సెంటర్ ను, అగ్రికల్చర్ మార్కెట్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ - నాన్ వెజ్ మార్కెట్ మరియు కంపోస్ట్ యార్డ్ లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.డి అయాజ్,డి.వై ఈ ఈ అభినయ్,డి.టి.సి.పి.ఓ  వి. బి శ్రీనివాస్ , ఏ.ఈ లక్ష్మి , టి.పి.ఎస్ రమ్య, మేనేజర్ శ్రీనివాస్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.