ఉప్పరి గూడా రైతులు తాసిల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు

Published: Tuesday September 20, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఉప్పరిగూడా గ్రామ ప్రజలు ఇబ్రహీంపట్నం చెరువు నిండడం వల్ల రైతులు   సుమారు 100 ఎకరాల మాగానిలో నీళ్లు చేరడం వల్ల రైతులు ఏం చేసుకోలేని పరిస్థితి ఉందని స్థానికులు తెలియజేశారు. నిత్యం వ్యవసాయం చేసుకుని బ్రతుకు సాగితున్న తరుణంలో  చెరువులోకి వాటర్ రావడం వల్ల పొట్ట పోసుకోవడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మా ఉప్పరగూడ  రైతులకు ప్రభుత్వ తరఫున నష్టపరిహారం అందజేయాలని గ్రామస్తుల వేదన సోమవారం  తాసిల్దార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మడుపు వెంకటేష్, నగ్గూడి మహేందర్, బుట్టి మహేందర్, వెంకట్ రెడ్డి, బోసు పల్లి యాదయ్య, నరుకుడి సుగుణమ్మ, సెక్ రజియా, తదితరులు పాల్గొన్నారు.