రెండు రాష్ట్రాల స్థాయిలో జమలాపురములో కబడ్డీ పోటీలు.
Published: Monday February 27, 2023
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 26 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రుపాలెం మండలం పరిధిలోని జమలాపురం గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా హథిరాం బాబాజీ అండ్ సంతు సేవాలాల్ భక్తి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 2,3,4,5 తేదీల్లో ఈ పోటీలను జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 30,116 రూ, రెండవ బహుమతిగా 20,116 రూ, మూడో బహుమతిగా 15,116 రూ నాలుగో బహుమతిగా 10,116 రూ ఐదో బహుమతిగా 5,116 రూ ఆరో బహుమతిగా 3,116 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు.ఆసక్తి గల క్రీడాకారులు ఫిబ్రవరి 28వ తారీకు లోపుగా తమ తమ టీములను ఈ క్రింది నెంబర్లలో నమోదు చేసుకోవాలని తెలిపారు.భూక్యా గోపి నాయక్ 7729957972 మరియు నూనావత్ మేగీ నాయక్ 6301483293 నెంబర్లకు తమ టీముల, గ్రామాల పూర్తి వివరాలను అందజేసి టీములను నమోదు చేసుకోవాలని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులకు భోజన ఏర్పాట్లు కమిటీ వారు చేయనున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Share this on your social network: