నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Monday August 01, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం మండలంలోని చెర్లపటేల్ గూడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి.పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా  మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వారు తెలిపారు. భక్తిశ్రద్ధలతో గ్రామస్తుల  ఆధ్వర్యంలో  నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించిన ఉత్సవ కమిటీ నిర్వాహకులను వారు అభినందించారు,అనంతరం గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ నిర్వాహకులు  గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి ప్రత్యేకంగా శాలువాతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంబలపల్లి గీత రామ్ రెడ్డి,ఎంపిటిసి అంకిల ఆంజనేయులు ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు  గ్రామ పెద్దల తదితరులతో కలిసి ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్  ఆకుల యాదగిరి,మాజీ జడ్పీటీసీ కర్ణటి రమేష్ గౌడ్,సర్పంచ్లు బూడిదరామరెడ్డి,వంగటి కవిత తిరుమల్ రెడ్డి,
మండల అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం యువజన అధ్యక్షులు  జెర్కొని రాజు, టిఆర్ఎస్వి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్,
మాజీ ఎంపిటిసిలు  పంది మైసయ్య, జకుల లక్ష్మయ్య యాదవ్,ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ల బర్ల జగదీష్ యాదవ్,యాచారం రవీందర్, టిఆర్ఎస్వి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మేలారం విజయ్ కుమార్,  టిఆర్ఎస్వి మండల్ ఉప అధ్యక్షులు కాలే శివ కుమార్, రవీందర్, శివ,గ్రామ వార్డ్ సభ్యులు పి నవీన్ గౌడ్,సుబురి నిర్మల, చిట్టి అండాలు,నాయకులు బిక్షపతి యాదవ్,రఘు గుప్తా,కర్రే శేఖర్, చిన్న నాయక్
ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.