మొక్కలు నాటిన బిజెపి నాయకులు
Published: Wednesday July 07, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి పట్టణ కేంద్రంలో మంగళవారం జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్ లలో మొక్కలు నాటే కార్యక్రమం పట్టణ కేంద్రంలోని సాయినగర్లో ఓబీసి మోర్చ యాదాద్రి - భువనగిరి జిల్లా ఇంచార్జీ బూత్ ఇంచార్జీ బందారపు లింగస్వామి గౌడ్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య, ఉపసర్పంచి మైసోళ్ల మత్సగిరి, బూత్ కన్వీనర్ మండల ఉపాధ్యక్షులు రేగూరి అమర్, మారగోని బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: