బర్రెలు కోల్పోయిన బాదిత కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్

Published: Tuesday June 29, 2021

జన్నారం, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని రోటి గూడ గ్రామంలో విద్యుత్ షాక్ తో ఆదివారం ముప్పై గేదెలు మృతి చెందిన విషయం తెలిసిందే, కాగా ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ సోమవారం బాధిత రైతులను పలకరించారు, విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. పాడి రైతులకు  ప్రభుత్వ పరంగా సహాయం పొందడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పరిహారం కోసం నివేదిక తయారు చేసి  ప్రభుత్వానికి పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన రవీందర్రావు వైస్ ఎంపీపీ సుతారి వినయ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజా రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,