జన్మదినాన్ని పురస్కరించుకొని అనాధలకు ఆపన్న హస్తం : మంజు కుమావత్ రమేష్ కుమావత్
Published: Wednesday March 17, 2021
వికారాబాద్ జిల్లా, ప్రతినిధి మార్చి16 ( ప్రజాపాలన ) : మంజు కుమావత్ రమేష్ కుమావత్ పుణ్యదంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథలకు ఆపన్నహస్తం అందించారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని కొంపల్లి మహిమా మినిస్ట్రీస్ అనాధాశ్రమంలోని అనాథలకు బిర్యానీ తర్బూజా అరటి పండ్లు బిస్కెట్లు జిలేబీ దుస్తులు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం తమకు తోచిన సహాయం జన్మదినం పెళ్లిరోజు సందర్భాలను పురస్కరించుకొని నిరుపేదలకు ఆపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క పూట భోజనం అనాథలకు ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని వారు ఆకాంక్షించారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని వదిలేస్తే వారి కడుపు నింపేది ఎవరని ఆందోళన వ్యక్తంచేశారు. తమ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా ఒక్క పూట భోజనానికి సరిపడు ఆహార పదార్థాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరణ్ రావు గోపాల్ రాజ్ పురోహిత్ సంతోషి దేవి సంతోషి భాటి సంతోషి రావు అనిత అంకిత్ దీక్ష వర్ష మదన్ కుమావత్ పూజా కుమావత్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: