చింతల నర్సింహారెడ్డి పై దాడిని ఖండించిన దర్గా దయాకర్ రెడ్డి

Published: Thursday December 16, 2021
మేడిపల్లి, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు చింతల నర్సింహారెడ్డి పై స్థానిక కార్పొరేటర్ కౌడే పొచయ్య అనుచరులు దాడి చేయడాన్ని పీర్జాదిిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చింతల నర్సింహారెడ్డిని స్థానిక హాస్పిటల్ మురుగన్ లో చేర్పించారు. ఈ ఘటన పై దర్గా దయాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి దాడికి కారకులైన వ్యక్తులపై తగు విచారణ జరిపించి చర్యలు తీసుకోవలని పోలీస్ లను డిమాండ్ చేశారు.