శ్రీ గోదాదేవి సమేత రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం జాతర ప్రారంభం
Published: Wednesday January 12, 2022
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలలో పాల్గొన్నాలన్న ఆలయా కమిటీ చైర్మన్
జన్నారం రూరల్, జనవరి 11, ప్రజాపాలన: మండలంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం పోన్కల్ నందు శ్రీ గోదాదేవి సమేత రంగనాథస్వామి కల్యాణా మహోత్సవం జాతర మంగళవారం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయం కమిటీ చైర్మన్ కస్తూరి నగేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం స్వామివారి అభిషేకము, గోవిందా నామాల సంకీర్తన, విష్ణు సహస్ర నామ పారాయనము, లలిత సహస్ర నామ పారాయనము నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయనము, సహస్ర భగవద్గీత పారాయనము, బుధవారం శ్రీ గోదాదేవి సమేత రంగనాథస్వామి కల్యాణా మహోత్సవం నిర్వహింస్తామని తెలిపారు. బక్తులు కోవిడ్ నిబంధనాలు పాటిస్తూ ఉత్సవాలలో పాల్గొన్నాలని తెలిపారు. భక్తుల కోసం విశాలమైన మైదానములో అన్నా సంతార్పణా జరుపాబడునని, మండలంలో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తీర్థ ప్రసాదాలు అందుకోవాలని ఆయన తెలిపారు
Share this on your social network: