దుబాయ్ లో వరదల్లో చిక్కుకుని మండల వాసి మృతి.

Published: Monday August 01, 2022
జన్నారం, జూలై 31, ప్రజాపాలన:
 
 గతవారం రోజులుగా దుబాయ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చిన వరదల్లో  చిక్కుకుని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం , చింతగూడ గ్రామానికి చెందిన ఉప్పు లింగారేడ్డి (35)అనే వ్యక్తి మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. రెండు నెలలు క్రితం బతుకు దెరువు కోసం దుబాయ్ కి వేళ్లి అక్కడ  కూలీ పని చేస్తున్నడు. ఈ క్రమంలో లింగారేడ్డి గత శుక్రవారం అక్కడ ప్రమాదవశాత్తూ వరదల్లో చిక్కుకొని మృతి చెందినట్లు అక్కడ ఉన్న గల్ఫ్ కార్మికులు ఆదివారం కుటుంబ సభ్యులకు  సమచారమందించారు. మృతునికి  భార్య శిరిషాతో పాటు ఇద్దరు  కుమారులు, వృద్ధురాలైన తల్లి లక్ష్మీ బాయి ఉన్నారు. లింగారేడ్డి మృతి దేహాన్ని తొందరగా స్వంత గ్రామాలకు తెప్పించాలని చింతగూడ సర్పంచ్ అరే జ్యోతి, వైస్ ఎంపిపి సూతరి వినాయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.